రైతులను పట్టించుకోకుండా.సంబురాలపై రివ్యూ ఏంటి

రైతులను పట్టించుకోకుండా.సంబురాలపై రివ్యూ ఏంటి

యాదాద్రి, వెలుగు:  ట్రిపుల్​ఆర్​ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను పట్టించుకోకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై రివ్యూ చేయడమేంటని బీజేపీ స్టేట్​లీడర్​గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. ట్రిపుల్​ ఆర్​ బాధితులు రెండ్రోజులుగా కలెక్టరేట్​ ఎదురుగా చేస్తున్న ఆందోళనకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్​ ఎదురుగా ఆందోళన చేస్తున్న రైతులు కన్పిస్తున్నా మంత్రి జగదీశ్​ రెడ్డి పట్టించుకోకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు. 

భువనగిరి ఎమ్మెల్యే శేఖర్​ రెడ్డి పక్కనే ఉండి చెప్పక పోవడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉండి రైతులకు నష్టం జరుగుతున్నా స్పందించక పోవడం దారుణమన్నారు. ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ మార్పు విషయంలో సీఎం కేసీఆర్​తో లెటర్​ రాయించాలని ఆయన డిమాండ్​ చేశారు.