రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నా టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ దుకాణం మూతపడడం ఖాయమన్నారు. నాగర్ కర్నూలు కొల్లాపూర్ క్రాస్ రోడ్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆచారి.