ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ప్రభాస్ సినీ జర్నీ... మరోసారి థియేటర్లోకి 'వర్షం'

ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ప్రభాస్ సినీ జర్నీ... మరోసారి థియేటర్లోకి 'వర్షం'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష నటించిన బ్లాక్ బస్టర్ లవ్ ఎంటర్ టైనర్ వర్షం మరోసారి సినీ అభిమానుల్ని ఆకట్టుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 11న హెచ్ డీ క్వాలిటీతో 4కే టెక్నాలజీలో విడుదల కానుంది. అంతకుముందు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22నే వర్షం సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్వాహకులు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తేదీలో మార్పు చేస్తూ నవంబర్ 11గా డిసైడ్ చేశారు. అయితే ఈ సినిమాను ఆ రోజే రిలీజే చేయడానికి ఓ గట్టి కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఆ రోజుతో 20ఏళ్లు పూర్తవుతుంది. ఆ రోజ్ డార్లింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ సినిమా రిలీజ్ అయ్యింది.  అందువల్లే ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల ప్రచారం.

ప్రభాస్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన వర్షం రిరిలీజ్ కానుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శోభన్ దర్శకత్వంలో మ్యూజిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ తోనే మన డార్లింగ్ ప్రభాస్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దాదాపు ఆరు కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ప్రభాస్ కే కాదు.. విలన్ రోల్ చేసిన గోపి చంద్ కూ మరిన్ని అవకాశాల్ని తెచ్చిపెట్టాయి. అంతేకాదు మూడింతల లాభాన్నీ తెచ్చిపెట్టాయి. అయితే ఇదే తరహాలో ఆయన నటించిన కొన్ని సినిమాలో మళ్లీ థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.