
- టీడబ్ల్యూజేఎఫ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో జర్నలిస్టులందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. యూనియన్లకు అతీతంగా విలేకరుల కు శిక్షణ ఇవ్వాలని కోరింది.
శుక్రవారం పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీశ్ను ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్యతోపాటు ఉపాధ్య క్షుడు ఎల్గోయి ప్రభాకర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, బి.జగదీశ్ కలిశారు. స్పందించిన కమిషనర్ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్రావుకు కాల్ చేసి శిక్షణ తరగతుల్లో జర్నలిస్టులందరికీ అవకాశం ఇవ్వాలని ఆదేశించినట్లు ఫెడరేషన్ నేతలు తెలిపారు.