
హైదరాబాద్, వెలుగు: బీహార్ నుంచి పిస్టల్స్ తెచ్చి నగరంలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు గన్నులు, ఆరు రౌండ్ల బుల్లెట్లు, మూడు మేగజీన్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సురేందర్రెడ్డితో కలిసి రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు. బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన అరుణ్ యాదవ్ (30), శంకర్ యాదవ్ (48)లు ఏడేళ్ల కింద హైదరాబాద్కు వచ్చారు. అల్మాస్గూడలో ఉంటున్న అరుణ్ యాదవ్ ఓ బార్లో పనిచేస్తున్నాడు. శంకర్ యాదవ్ సికింద్రాబాద్లోని ఓ హోటల్కు వాచ్మెన్గా ఉన్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన అరుణ్ యాదవ్, బీహార్కే చెందిన మిథిలేశ్ (35) అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతడి నుంచి ₹20 వేలకు గన్నులు కొని శంకర్ యాదవ్తో కలిసి నగరంలోని నేరగాళ్లకు లక్షలకు అమ్ముతున్నాడు. తాజాగా ఓ వ్యక్తికి ఇలాగే గన్నులు అమ్ముతున్నాడన్న సమాచారంతో పోలీసులు మీర్పేట్లోని అల్మాస్గూడలో అరుణ్ యాదవ్, శంకర్ యాదవ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిథిలేశ్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురిపైనా బీహార్లో కేసులున్నట్టు చెప్పారు. గన్నులను ఇప్పటిదాకా ఎవరెవరికి అమ్మారు, ఇంకా ఎవరున్నారన్నదానిపై విచారిస్తున్నారు.