హైదరాబాద్, వెలుగు: బీహార్ నుంచి పిస్టల్స్ తెచ్చి నగరంలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు గన్నులు, ఆరు రౌండ్ల బుల్లెట్లు, మూడు మేగజీన్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సురేందర్రెడ్డితో కలిసి రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు. బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన అరుణ్ యాదవ్ (30), శంకర్ యాదవ్ (48)లు ఏడేళ్ల కింద హైదరాబాద్కు వచ్చారు. అల్మాస్గూడలో ఉంటున్న అరుణ్ యాదవ్ ఓ బార్లో పనిచేస్తున్నాడు. శంకర్ యాదవ్ సికింద్రాబాద్లోని ఓ హోటల్కు వాచ్మెన్గా ఉన్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన అరుణ్ యాదవ్, బీహార్కే చెందిన మిథిలేశ్ (35) అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతడి నుంచి ₹20 వేలకు గన్నులు కొని శంకర్ యాదవ్తో కలిసి నగరంలోని నేరగాళ్లకు లక్షలకు అమ్ముతున్నాడు. తాజాగా ఓ వ్యక్తికి ఇలాగే గన్నులు అమ్ముతున్నాడన్న సమాచారంతో పోలీసులు మీర్పేట్లోని అల్మాస్గూడలో అరుణ్ యాదవ్, శంకర్ యాదవ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిథిలేశ్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురిపైనా బీహార్లో కేసులున్నట్టు చెప్పారు. గన్నులను ఇప్పటిదాకా ఎవరెవరికి అమ్మారు, ఇంకా ఎవరున్నారన్నదానిపై విచారిస్తున్నారు.
నగరంలో బీహార్ పిస్టల్స్..ఇద్దరు అరెస్ట్
- హైదరాబాద్
- June 9, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!