రెండు చోట్ల చైన్ స్నాచింగ్.. ఒకే వ్యక్తి చేశాడు

రెండు చోట్ల చైన్ స్నాచింగ్.. ఒకే వ్యక్తి చేశాడు

హైదరాబాద్ లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. నగరంలోని చింతల్, కెపిహెచ్బి పరిధిలో రెండు చోట్లా మహిళల మెడలో ఉన్న బంగారు గోలుసులను లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. చింతల్ మహేంద్ర నగర్ లోని లత అనే మహిళ రాత్రి స్థానికంగా ఉన్న ఓ టైలర్ దుకాణానికి వెళ్లింది. షాపు నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా స్కూటీ పై  మాస్క్, క్యాప్ పెట్టుకుని వచ్చిన అగంతకుడు... నడుచుకుంటూ వెళ్తున్నలత మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గోలుసును లాక్కెళ్లాడు. అనంతరం అదే దుండగుడు కెపిహెచ్బి  రోడ్ నెం2 లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ లో ఉన్న పద్మజ రెడ్డి అనే మహిళ మెడలో నుంచి కూడా నాలుగు తులాల గోల్డ్ చైన్ ను ఎత్తుకెళ్లాడు. ఈ రెండు ఘటనలపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే దుండగుడు రెండు చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.