
రోడ్డు పక్కన ఆపి ఉంచిన కారులో ఇద్దరి మృతదేహాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. రోహిణిలోని సెక్టార్ 13 రోడ్డులో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిని ఓంప్రకాష్ కుక్రేజా, సుదీప్తా ముఖర్జీగా పోలీసులు గుర్తించారు. ఓంప్రకాష్ తనను తాను కాల్చుకునే మందు సుదీప్తాను కాల్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఓంప్రకాష్ మరియు సుదీప్తా ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేసేవారు. సదీప్తా అదే ఆస్పత్రికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఓంప్రకాష్.. సుదీప్తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ, కుదరక వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఓంప్రకాష్, సుదీప్తాల మధ్య అక్రమసంబంధం నడుస్తుంది. తనను పెళ్లి చేసుకోవలసిందిగా సుదీప్తా, ఓంప్రకాష్ను ఇబ్బంది పెట్టడం వలనే ఈ జంట ఆత్మహత్యలు జరిగుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
More News