సింగరేణి విజిలెన్స్ ​అదుపులో ఇద్దరు ఉద్యోగులు

సింగరేణి విజిలెన్స్ ​అదుపులో ఇద్దరు ఉద్యోగులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్​బోర్డులో అక్రమాలు, అవినీతిపై ఇద్దరు ఉద్యోగులను సింగరేణి విజిలెన్స్​ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ ​బోర్డు, ట్రాన్స్​ఫర్స్, ఇతర పైరవీల పేరుతో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారంటూ కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​వర్క్​షాపులో పని చేస్తున్న డ్రైవర్ రాజేశ్వర్​రావును వారం రోజుల కింద ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్​కు పంపింది.

కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ ఆస్పత్రి వార్డు బాయ్​తో పాటు సింగరేణి సెంట్రల్​ వర్క్​షాపులో మరో వ్యక్తిని సింగరేణి విజిలెన్స్​ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మెడికల్​బోర్డు దందాలో భాగంగానే వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.