
దుబాయ్: క్రిస్మస్ పండగ రోజే దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదం బధవారం తెల్లవారుజామున జరిగింది. కేరళకు చెందిన రోహిత్ కృష్ణకుమార్ (19), శరత్ కుమార్ (21) ఇద్దరూ క్రిస్మస్ పార్టీ నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఇద్దరూ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. కృష్ణకుమార్ యూకెలో పైచదువులు చదువుతుండగా.. శరత్ కుమార్ యూఎస్లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. వీరిద్దరూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తమ పాఠశాల విద్యను పూర్తి చేశారు. క్రిస్మస్ సందర్భంగా వారు ఇండియాకు వచ్చి తమ కుటుంబాలతో కలిసి వేకేషన్కి దుబాయ్ వెళ్లారు. సెలవులు సరదగా గడపాలని వస్తే ఇలా జరగడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగాయి.
For More News..