ఢిల్లీలో గత కొద్ది రోజులుగా పోలీసులకు, లాయర్లకు మధ్య చెలరేగిన ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో ఇద్దరు లాయర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రోహిణి కోర్టు ఏరియాలో ఆశిష్ అనే న్యాయవాది తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తోటి లాయర్లు అతడిని అడ్డుకున్నారు. మరో న్యాయవాది రోహిణి కోర్టు కాంప్లెక్స్ పైభాగంలోకి ఎక్కి అక్కడినుంచి దూకుతానని బెదిరించాడు.
పోలీసులకు,లాయర్లకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా గురువారం కూడా లాయర్లు సమ్మెను కొనసాగించారు. దీంతో జిల్లా కోర్టుల్లో కేసులన్నీ నిలిచిపోయాయి.
ఈ నెల 2న టిస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ దగ్గర పోలీసులకు, లాయర్లకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆరు కోర్టుల లాయర్లు సమ్మెకు దిగారు. పాటియాల హౌస్, సాకేత్ జిల్లా కోర్టుల ప్రధాన గేట్లను మూసివేశారు.