జార్ఖండ్ లో కాల్పులు: ఇద్దరు మావోలు మృతి

జార్ఖండ్ లో కాల్పులు: ఇద్దరు మావోలు మృతి

జార్ఖండ్ లో భద్రతా బలగాలు– మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇవాళ  గుమ్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో రెండు ఏకే  47 గన్స్ స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు భద్రతా దళాలు.