మరో రెండు రోజులు భారీ వర్షాలు

మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా  హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా మంఖాల్ లో అత్యధికంగా 15. 4 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, జక్రాన్ పల్లిలో 11.4, ఆదిలాబాద్ జిల్లా సోన్ లో 9.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నల్గొండ జిల్లా మాటూరులో 8.3,  పెర్కిచట్ 8.3 రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ 7.4 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, మెదక్ జిల్లా సరికొండ, శంకరం పేటలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 6.1, గ్రేటర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో 5,5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో కాలనీలను వరద ముంచెత్తింది.