తెలంగాణలో మరో రెండు ప్రైవేటు వర్సిటీలు!

తెలంగాణలో మరో రెండు ప్రైవేటు వర్సిటీలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టానికి మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.  శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు వీఎన్ఆర్​ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త  ప్రైవేటు వర్సిటీల కోసం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఆయా కాలేజీలను పరిశీలించి, సర్కారుకు రిపోర్టు ఇవ్వనున్నారు. 

కాగా, సర్కారు అనుమతి ఇస్తే వచ్చే ఏడాది ఈ రెండు వర్సిటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మూడేండ్ల కింద ఐదు ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమయ్యాయి. గతేడాది ఐదు వర్సిటీలకు కేబినేట్ ఆమోదం తెలిసి..గవర్నర్​కు ఆ బిల్లును పంపించగా, దాన్ని ప్రభుత్వానికి తిప్పిపంపారు.