ఒకే రోజు రెండు హత్యలు.. అసలేం జరుగుతోంది.?

ఒకే రోజు రెండు హత్యలు.. అసలేం జరుగుతోంది.?

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ శివారులో దారుణ హత్య జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్ అహ్మద్ గా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకోసం పటాన్ చెరు హాస్పిటల్ కు తలించారు. సంగారెడ్డిలోని బంధువుల ఇంటి నుంచి టోలిచౌకికి తిరిగి వెళ్తుండగా జరిగిన గొడవలో నదీమ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు తెలుస్తోంది. 

మరో వైపు  హైదరాబాద్ పాతబస్తీ కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో  బాబానగర్ సి-బ్లాక్  దగ్గర షేక్ నసీర్ అనే వ్యక్తిపై  దారుణంగా కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఒవైసీ హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. షేక్ నసీర్ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు పోలీసులు.  కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.  రెండు, మూడేళ్ల క్రితం జహీరాబాద్ లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో నసీర్ కూడా ఒకడన్నారు. పాత కక్షలతోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.