ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16 మంగళవారం రోజున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మరోవైపు.. 10 మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు సైనికులను ఆసుపత్రికి తరలించారు.
Chhattisgarh | One more security personnel injured in an encounter between police and Naxals in the Kanker district. Encounter is going on in the forest area of the Chhotebethiya police station limits: IG Bastar P Sundarraj
— ANI (@ANI) April 16, 2024
A total of three security personnel have been injured… https://t.co/kEylNvmiHY
ఇంకా ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉందని.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా పోలీసు అధికారి ఐకె ఎలెసెలా వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ఈ ఎన్కౌంటర్ జరగడం గమానార్హం. ఏప్రిల్ 26న కంకేర్ జిల్లా ఓటింగ్ జరగనుంది. . గత నెలలో కంకేర్ జిల్లాలో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఒక నక్సల్ చనిపోయాడు .