ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లో  భారీ ఎన్‌కౌంటర్..   18 మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16 మంగళవారం రోజున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.   భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మరోవైపు.. 10 మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డట్లుగా తెలుస్తోంది.  గాయపడిన ఇద్దరు సైనికులను ఆసుపత్రికి తరలించారు. 

ఇంకా ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉందని.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా పోలీసు అధికారి ఐకె ఎలెసెలా  వెల్లడించారు.   2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమానార్హం.   ఏప్రిల్ 26న కంకేర్ జిల్లా ఓటింగ్ జరగనుంది.   . గత నెలలో కంకేర్ జిల్లాలో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సల్‌ చనిపోయాడు .