మదర్సాకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్

మదర్సాకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్

మెహిదీపట్నం, వెలుగు: .మదర్సా  కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. గోల్కొండ  సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. షేక్ సుభాన, ఫిరోజ్ దంపతులు మల్లేపల్లిలో ఉంటున్నారు. వీరి కుమారులు మహమ్మద్ బిలాల్(10), మహమ్మద్ రహీం (8), ఈనెల 20న గోల్కొండ పీఎస్ పరిధిలోని సాలెహ్ నగర్ కంచె లోని మదర్సా కు వెళ్లారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.