జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం షోపియాన్‌ జిల్లా రెబన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు…పోలీసులపై కాల్పులకు దిగారు. అలర్టైన  పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు అక్కడి కక్కడే హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఘటనా స్థలంలోనే దాక్కున్నట్లు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.