జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున(మంగళవారం) జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. అలర్టైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 26న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ శ్యామల్ కుమార్తో పాటు ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.