గాంధీ దవాఖానాలో డెడ్ బాడీల కలకలం

గాంధీ దవాఖానాలో డెడ్ బాడీల కలకలం
  • ఆస్పత్రి ఆవరణలో రెండు మృతదేహాల గుర్తింపు
  • స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించిన పోలీసులు

పద్మారావునగర్​, వెలుగు : గాంధీ ఆస్పత్రిలో  సోమవారం రెండు గుర్తు తెలియని డెడ్ బాడీలు కలకలం రేపాయి.  చిలకలగూడ పోలీసులు తెలిపిన ప్రకారం.. గాంధీ మెడికల్ కాలేజీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి డెడ్​బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు 30 – 35  ఏండ్ల మధ్య ఉండొచ్చని, సంబంధీకులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించి డెడ్‌బాడీని తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. 

ఫుట్‌పాత్‌పైన మరొకటి..

ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగం ఎదురుగా ఫుట్‌పాత్‌పైన మరో డెడ్​బాడీని గుర్తించిన పోలీసులు మార్చురీకి తరలించారు.  మృతుడికి 65 ఏళ్లు ఉండొచ్చు. వీరు ఆస్పత్రి ఆవరణలో భిక్షాటన చేసే వారుగా భావిస్తున్నారు. సమీపంలోని కల్లు కాంపౌండ్‌లో  కల్లు తాగి, ఆస్పత్రి ఆవరణలోకి వచ్చి ఇక్కడే ఉంటున్నారు.  గతంలో  కొన్నిసార్లు గంజాయిని కూడా వీరి నుంచి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.