హైదరాబాద్: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళ(25)ను నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కు చికిత్స కోసం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ తనిఖీ చేసి ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఇదే విషయం మహిళను తీసుకొచ్చిన వారికి చెబుదామనేసరికి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి జారుకున్నారట. శనివారం ఉదయం వరకు వేచి చూసినా మృతురాలి బంధువులెవరూ రాకపోయేసరికి హాస్పటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్పటల్ కు చేరుకున్న పోలీసులు మార్చురీలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను 16.07.2021 న 22.25 గంటలకు ఒక ఆటోలో ఇద్దరు గుర్తు తెలియని మగ వ్యక్తులు తీసుకువచ్చారు, ఈ ఇద్దరు ఆసుపత్రికి ఎటువంటి వివరాలు ఇవ్వకుండా అక్కడి నుండి తప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. మృతురాలి శరీరంపై పచ్చబొట్టు ఆమె ఎడమ చేతిలో లక్ష్మీగా.. ఆమె కుడి వైపున ఒక పచ్చబొట్టు M గా ఉందన్నారు. ఎక్కడో హత్యచేసి హాస్పటల్ కు తీసుకు వచ్చారా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
చనిపోయిన మహిళను అడ్మిట్ చేసి జారుకున్నరు
- తెలంగాణం
- July 17, 2021
లేటెస్ట్
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- PBKS vs CSK: దూబే గోల్డెన్ డక్.. చెన్నైకి షాక్ల మీద షాక్లు
- ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
- పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు