చనిపోయిన మహిళ‌ను అడ్మిట్ చేసి జారుకున్న‌రు

చనిపోయిన మహిళ‌ను అడ్మిట్ చేసి జారుకున్న‌రు

హైద‌రాబాద్: అనుమానాస్ప‌దంగా మ‌హిళ మృతి చెందిన సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో జ‌రిగింది. శుక్ర‌వారం అర్ధరాత్రి ఓ మ‌హిళ‌(25)ను  నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కు చికిత్స కోసం ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తీసుకొచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ తనిఖీ చేసి ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఇదే విష‌యం మ‌హిళ‌ను తీసుకొచ్చిన వారికి చెబుదామ‌నేస‌రికి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి జారుకున్నారట‌. శ‌నివారం ఉదయం వరకు వేచి చూసినా మృతురాలి  బంధువులెవ‌రూ రాకపోయేసరికి  హాస్పటల్  సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.  హాస్పటల్ కు చేరుకున్న పోలీసులు మార్చురీలో  ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను 16.07.2021 న 22.25 గంటలకు ఒక ఆటోలో ఇద్దరు గుర్తు తెలియని మగ వ్యక్తులు తీసుకువచ్చారు, ఈ ఇద్దరు ఆసుపత్రికి ఎటువంటి వివరాలు ఇవ్వకుండా అక్కడి నుండి తప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో  తేలింద‌న్నారు.  మృతురాలి శరీరంపై పచ్చబొట్టు ఆమె ఎడమ చేతిలో ల‌క్ష్మీగా.. ఆమె కుడి వైపున ఒక పచ్చబొట్టు M గా ఉందన్నారు.  ఎక్కడో హత్యచేసి హాస్పటల్ కు తీసుకు వచ్చారా అనే కోణంలో   కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు పోలీసులు.