నిజామాబాద్ లో ప్రహారీ గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి

నిజామాబాద్ లో ప్రహారీ గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి

నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్ట శివారులో విషాదం జరిగింది.మున్సిపల్ డ్రైనేజ్ మరమ్మతులు చేస్తుండగా ప్రహారీ గోడ కూలింది. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడటంతో..ఇద్దరు కార్మికులు చనిపోయి మట్టిలో కూరుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. JCB,ఫైర్ ఇంజన్ల  సహాయంతో మృత దేహాలను వెలికి తీశారు. చనిపోయిన వారు  మహారాష్ట్రలోని చంద్రపూర్  చెందిన కిషోర్, బాదల్ గా గుర్తించారు.