తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాది సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాది సంబరాలు

తెలుగువారి తొలి పండుగ. తెలుగు నెలల్లో ప్రారంభయ్యే రోజు. షడ్  రుచులతో జీవిత పరమార్ధాన్ని చెప్పే పండుగ ఉగాది. ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటున్నారు. చైత్రమాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటారు. గుమ్మాలకు మామిడి ఆకులు, రంగు రంగుల పూలతో అలంకరణలు.... ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, వగరుతో ఉగాది రోజు పచ్చడి చేయడం ఆనవాయితీ. జీవితంలో సుఖ దుఖ్ఖాలు, సంతోషం, బాధ, మంచి చెడులు సమపాళ్లలో ఉంటాయనే అర్థాన్ని చెప్తూ... ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

చైత్ర మాసంతోనే తెలుగు నెల ప్రారంభం అవుతుంది. ఉగాది నుంచే అన్ని పండుగలు మొదలవుతాయి. అందుకే దీన్ని యుగారంభంగా చెప్తారు పండితులు. ఈ సీజన్లో లేలేత చిగుర్లు వస్తారు. వేప పూత, మామిడి కాత, చింత కాయలు ఈ సీజన్లోనే వస్తాయి. అందుకే ఉగాది పచ్చడి తయారీకి అప్పుడే కాస్తున్న మామిడి కాయలు, చింత పండు, వేప పూత, చెరుకు రసాన్ని ఉపయోగిస్తారు.  

ఇక కొత్త బట్టలు కట్టుకొని... ఉదయాన్నే ఇంట్లో పూజలు చేస్తారు. ఈ పూజల్లో ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేసి ఇష్టదైవాలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక పంచాగ శ్రవణాలు ఉంటాయి.  ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంతో ప్రత్యేకమైనది. మళ్లీ ఏడాది వరకు వాతావరణ పరిస్థితులు, పండుగ తేదీలు, గ్రహణాలు, రాశిఫలాలను వినిపిస్తారు పంతుళ్లు.