
కటక్ : అల్టిమేట్ ఖో ఖో లీగ్ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ ఒడిశా జాగర్నాట్స్తో రాజస్తాన్ వారియర్స్ మధ్య జరిగే తొలి పోరుతో లీగ్ షురూ అవనుంది. మరో మ్యాచ్లో తొలి సీజన్ రన్నరప్ తెలుగు యోధాస్.. ముంబై ఖిలాడీస్ జట్టుతో పోటీ పడనుంది. కొత్త సీజన్ కోసం తాము బాగా ప్రిపేర్ అయ్యామని యోధాస్ కెప్టెన్ ప్రతీక్ తెలిపాడు. ఈసారి ట్రోఫీ నెగ్గాలన్న ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.