
- భారత్తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏ క్రీడాకారుల హాజరు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో అండర్ 18 ఇంటర్నేషనల్ టెన్నిస్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలోని న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న పోటీలకు భారత్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏకు చెందిన క్రీడాకారులు హాజరై సింగిల్స్ విభాగంలో తలపడ్డారు.
బాల, బాలికల విభాగంలో రెండో రౌండ్, ఫైనల్ రౌండ్కు పలువురు క్వాలిఫై అయ్యారు. ఈ పోటీలు 31వ తేదీ వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.