కేటీఆర్ క్షమాపణ చెప్పాలె.. ఓయూలో దిష్టిబొమ్మ దహనం

కేటీఆర్ క్షమాపణ చెప్పాలె..  ఓయూలో దిష్టిబొమ్మ దహనం

 

  • మల్లన్నను పల్లి బఠాణీ అమ్ముకునే వ్యక్తి అంటవా
  • నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ 

 హైదరాబాద్​: కాంగ్రెస్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్నను అవమానపరిచిన కేటీఆర్​ వెంటనే క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ ఛైర్మెన్ మానవత రాయ్ డిమాండ్ చేశారు. మల్లన్నపై ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్నను పల్లి, బఠాణీ అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఓయూ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేటీఆర్ వెంటనే  విద్యార్థులకు  బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్​ ఇష్టారీతిన  మాట్లాడుతున్నారని మండిపడ్డారు.