నాచారం శివాలయంలో విగ్రహాల ధ్వంసం

నాచారం శివాలయంలో విగ్రహాల ధ్వంసం

మేడ్చల్ జిల్లా నాచారం శివాలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నాచారం చౌరస్తాలోని ఉన్న శివాలయంలో ఈ ఘటన జరిగింది. నాగదేవత, సుబ్రమణ్యస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు. మంగళవారం (మార్చి 10) ఉదయం కొందరు భక్తులు పూజలు చేసేందుకు ఆలయంలో వెళ్లిన సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు సమాచారంలో నాచారం ఎస్సై , పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఈ దుశ్చర్యకుపాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసుకున్నారు. 

ALSO READ :- మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి అవార్డ్