బస్టాండ్ ​వద్ద మాటలు కలిపి లక్షన్నర కొట్టేసిండు

బస్టాండ్ ​వద్ద మాటలు కలిపి లక్షన్నర కొట్టేసిండు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో కోసం వెయిట్ ​చేస్తున్న ఓ వృద్ధుడితో మాటలు కలిపి గుర్తుతెలియని వ్యక్తి లక్షా 44 వేలు కొట్టేశాడు. మల్యాల మండలం మానా లకు చెందిన ఎడపల్లి గంగయ్య సోమవారం గోపాలరావుపేటలోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు జగిత్యాల వచ్చాడు. పాత బస్టాండులో ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి గంగయ్యతో మాటలు కలిపాడు. ‘మీ అల్లుడు నాకు తెలుసు, ప్రస్తుతం అతను బ్యాంకులో ఉన్నాడు, అతని కోసం రెండు ఆపిల్స్ కొనుక్కు రండి’ అని గంగయ్యతో చెప్పాడు. నమ్మిన వృద్ధుడు రూ.లక్షా44 వేలు ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చేతిలో పెట్టి వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి అతను లేడు. మోసపోయానని గుర్తించిన గంగయ్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.