బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి : భగవంతు ఖుభా

బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి : భగవంతు ఖుభా

దేవరకద్ర/చిన్నచింతకుంట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని కేంద్ర మంత్రి భగవంతు ఖుభా పిలుపునిచ్చారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రజలను  మోసం చేసేందుకు కొత్త పథకాలు తెస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఇంటింటికీ వెళ్లి మోదీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. బీజేపీ పార్లమెంట్​ ఇన్​చార్జి డోకూరు పవన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎగ్గని నర్సిములు, దేవరకద్ర బాలన్న, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి నంబి రాజు, యజ్ఞ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.