అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు మంచింది

అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు మంచింది

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి

కేంద్రం దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభమన్నారు. కేటీఆర్‌ ఆడగముందే హైదరాబాద్‌కు NCDC సెంటర్ ను కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. NCDC సెంటర్ కు రాష్ట్ర ప్ర‌భుత్వం భూమిని కేటాయించాల‌న్నారు

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడం లేద‌ని,
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందు కు వచ్చినా భూముల్ని ఆలస్యంగా కేటాయించార‌న్నారు. బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని వెంటనే కేంద్రానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయ సమస్యలు లేవ‌ని, ఆదిలాబాద్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని ఆయ‌న అన్నారు. రెండో విడతలో దేశ వ్యాప్తంగా 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామ‌ని , రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ ఉపయోగం ఉంటుంద‌న్నారు. వ్యాక్సిన్ పై అనుమానాలు, ఆరోపణలు సరైనవు కావని, వ్యాక్సినేషన్ పై రాజకీయాలు అవసరం లేదని అన్నారు.