ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ ఆఫీసులోకి ఎట్లొస్తరు ?

ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ ఆఫీసులోకి ఎట్లొస్తరు ?

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తరుచూ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా అని వ్యాఖ్యానించారు. మరోసారి కార్యాలయం లోపలికి వస్తే బాగుండదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

‘‘ స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాల ధోరణి మారకుంటే ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లలో ఐబీ వాళ్లను పెడతాం .. మీరు ఒప్పుకుంటారా..?’’ అని కామెంట్ చేశారు. అక్కడ ఒప్పుకుంటే.. రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తానని కిషన్ రెడ్డి ఆగ్రహంగా చెప్పారు.