పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రికి స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ నాయకులతో కలసి ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులకు అమ్మవారి ఆశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

శ్రీకాళహస్తిలో కేంద్ర మంత్రి

తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానీ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సంప్రదాయాలతో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు.