దుండగుల దాడిలో చేర్యాల జెడ్పీటీసీ మృతి

దుండగుల దాడిలో చేర్యాల జెడ్పీటీసీ మృతి

సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లాలో చేర్యాల  జెడ్పీటీసీ శేట్టే మల్లేశం చనిపోయారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉదయం మార్నింగ్ వాక్ తర్వాత ఇంటికి వెళ్తుండగా మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాడి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మల్లేశాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మల్లేశం పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట నుండి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్సపొందుతూ మల్లేశం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.