గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మక్తా మహబూబ్ పేట కుంటలో ఓ మహిళ మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటికి తీయించారు.

ఆమె వయస్సు 30 నుంచి 35 వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.  డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను హత్య చేసి కుంటలో పడేసి ఉంటారా, లేదా మరేమైనా కారణమా తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వివరాలు ఇంకా తెలియరాలేదు.