20 ఏళ్లుగా తిరుగుతున్నా పట్టా ఇవ్వడం లేదు

20 ఏళ్లుగా తిరుగుతున్నా పట్టా ఇవ్వడం లేదు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఉప్పలయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలేరు మండలం కొలనుపాకలో 4 ఎకరాల భూమిని 20 ఏళ్ల క్రితం ఆయన కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి పట్టాదారు పుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ పాస్ పుస్తకం రాకపోవడంతో మనస్థాపం చెందిన ఉప్పలయ్య కలెక్టర్ చాంబర్ వెళ్లి సూసైడ్ కు ప్రయత్నించాడు. పక్కనున్న వారు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో ఉప్పలయ్యతో మాట్లాడుతున్నారు జాయింట్ కలెక్టర్.