మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..పూణెలో సమీపంలో కుప్పకూలిన వంతెన..పదుల సంఖ్యలో టూరిస్టులు గల్లంతు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..పూణెలో సమీపంలో కుప్పకూలిన వంతెన..పదుల సంఖ్యలో టూరిస్టులు గల్లంతు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం(జూన్15)మధ్యాహ్నం పూణె సమీపంలో ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది.ఈ ప్రమాదంలో 15 మంది టూరిస్టులు నదిలో పడిపోయారు. వీరిలో ఆరుగురిని రక్షించారు. మరో 9మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

పూణె జిల్లాలోని పంప్రి చించ్ వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండమాల సమీపంలో ఇంద్రాయణి నదిపై ఈ ప్రమాదం జరిగింది. కుండమల ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెనపైకి పెద్ద సంఖ్యలో  పర్యాటకులు వచ్చారు. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో చాలామంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. 

ఆదివారం వంతెనపై పర్యాటకుల రద్దీ పెరిగినట్టు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పాత వంతెన కూలిపోవడంతో చాలామంది నదిలో మునిగిపోయి ఉంటారని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా తెలిసిరాలేదు. 

విషయం తెలుసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ టీంలు, గ్రామస్తులు ఘటనా స్థ లానికి చేరుకొని అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇంద్రాయణి నది నీటిమట్టం , ప్రవాహం బాగా పెరిగింది. ఇది సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. 

కూలిపోయిన వంతెన దశాబ్దాల నాటిదని, పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కుండ్ మాల ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు, యాత్రికులకు ఇది ఉపయోగంలో ఉంది. వంతెన ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు , ఎంతమంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది.