మేమే గెలిచాం.. ఓటింగ్‌‌ ఆపేయండి

మేమే గెలిచాం.. ఓటింగ్‌‌ ఆపేయండి

యూఎస్ సుప్రీంకు వెళ్తామన్న ట్రంప్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ సాగుతున్న పోరులో ట్రంప్‌‌పై బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఓటింగ్ కౌంటింగ్ పూర్తి కానప్పటికీ గెలుపుపై ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచానని, ఎలక్షన్స్ ముగిసిన ప్రక్రియ అని ట్రంప్ చెప్పడం విశేషం. నిజాయితీగా చెప్పాలంటే మనం గెలిచాం అంటూ వైట్ హౌజ్ వద్ద తన మద్దతుదారులతో ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి జో బైడెన్ 225 ఎలక్టోరల్ ఓట్లతో ముందుండగా, ట్రంప్‌‌కు 213 ఓట్లు వచ్చాయి. ‘ఇది అమెరికా ప్రజలను మోసగించడమే. మనం ఎన్నికల గెలుపునకు చాలా దగ్గర్లో ఉన్నాం. నిజాయితీగా చెప్పాలంటే మనం గెలిచాం. సమగ్రతను కాపాడుకోవమే మన లక్ష్యం. అందుకే యూఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం. అంతటా ఓటింగ్‌‌ను నిలిపివేయాలి’ అని తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో ట్రంప్ పేర్కొన్నారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా రాష్ట్రాల ఫలితాలు ఇంకా వెలువడలేదు.