చికిత్స కోసం అమెరికా టు ఇండియా!

చికిత్స కోసం అమెరికా టు ఇండియా!
  • యూఎస్ వాసికి అన్నవాహిక,  జీర్ణాశయం కలిసే చోట చిన్న కణితి 
  •     అమెరికన్​ఆంకాలజీకి వచ్చిన పేషెంట్​
  •     1.5 సె.మీ కణతిని తొలగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆ పేషెంట్​ఉండేది అమెరికాలో.. అక్కడ లేని ఆధునిక చికిత్సలు లేవు.. అయినా అతడు తన వ్యాధి నయం చేసుకోవడానికి ఇండియాకు వచ్చాడు. అది కూడా మెడికల్​హబ్​గా పేరుగాంచిన హైదరాబాద్​కు....వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. యూఎస్​కు చెందిన 54 ఏండ్ల రోగికి అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట1.5 సెంటీమీటర్ల కణితి ఏర్పడింది. ఇది చాలా చిన్నది కావడం, కంటికి సరిగ్గా కనిపించని చోట ఉండటంతో సాధారణ సర్జరీ ద్వారా తొలగించడం సవాలుగా మారింది. 

దీంతో హైదరాబాద్​లోని అమెరికన్​ఆంకాలజీ ఇన్​స్టిట్యూట్​సీనియర్ రోబోటిక్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గజగౌని ను సంప్రదించాడు. ఆయన నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ట్రిపుల్​ఐసీజీ ఫ్లోరోసెన్స్ విధానంలో రోబోటిక్​సర్జరీ చేసి కణతిని విజయవంతంగా తొలగించింది. 

సర్జన్లు తమ అనుభవంపై ఆధారపడి కణితిని గుర్తిస్తారని, కానీ, ట్రిపుల్ ఐసీజీ పద్ధతిలో ఇండోసైనిన్ గ్రీన్ అనే కలర్​ఉపయోగించి క్యాన్సర్​కణితిని గుర్తించి పూర్తిగా తొలగించొచ్చవచ్చని డాక్టర్​జగదీశ్వర్​గౌడ్​చెప్పారు. దీన్ని ఇండియాలో తాము మాత్రమే వాడుతున్నామని, ఈ విధానంలో ఇప్పటివరకు 32 మందికి సర్జరీ చేయగా, వంద శాతం సక్సెస్​రేటు సాధించామన్నారు. ఈ అధ్యయనానికి అమెరికాలోని మయామిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందన్నారు. కార్యక్రమంలో ఏవోఐ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పలచర్ల ప్రభాకర్ పాల్గొన్నారు.