సీఎం రేవంత్​కు నోటీసులు కక్ష సాధింపే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్​కు నోటీసులు కక్ష సాధింపే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  ఓటమి భయంతో బీజేపీ బెదిరింపు చర్యలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో బీజేపీ ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తున్నదని ఆరోపించారు. 

ఫేక్ వీడియోలు అంటూ నోటీసులు పంపుతున్నారు. రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం” అని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.