
మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్య ఇచ్చిన పదవులతో కేటీఆర్ విర్రవీగుతున్నాడని అన్నారు. ఎవరి చరిత్ర ఎంటో తెలుసుకుని మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులతో కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ ఎస్ లో చేర్చుకుంటున్నారని అన్నారు. గెలుస్తామని సర్వేలు చేయించి..డబ్బుతో కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కొంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గుత్తా సఖేందర్ రెడ్డి కౌన్సిల్ ఛైర్మన్ గా ఉండి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆర్ధిక భారం లేకుండా గుత్తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసిందన్నారు. గుత్తా దిగజారుడు రాజకీయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చే్స్తామన్నారు. హుజూర్ నగర్ ఎన్నికలకు లోకల్ పోలీసులపై నమ్మకం లేదని..పూర్తిగా కేంద్ర బలగాలే కావాలని ఈసికి ఫిర్యాదు చేస్తామన్నారు ఉత్తమ్.