న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాల్సిందే

న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాల్సిందే

న్యాయవాదులకు.. రక్షణ చట్టం ఉండాల్సిందే అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. వామనరావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ చేయకుంటే.. ఈ కేసులో ఆధారాల్లేకుండా చేసి కొట్టేసే అవకాశం వుందన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన న్యాయవాదులకు రక్షణ లేదని.. పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు ఉత్తమ్. వామనరావు, ఆయన తండ్రి అధికార పార్టీ నేతల పేర్లు చెప్పినా.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ దగ్గర న్యాయవాదుల ఆందోళనకు హాజరైన ఉత్తమ్.. లాయర్లకు తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.