హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సహా పలువురు మంత్రులు శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డను సందర్శించనున్నారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను బుధవారం రిలీజ్ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ఈఎన్సీ మురళీధర్ హెలిక్యాప్టర్లో బయల్దేరుతారు.
11.30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇరిగేషన్ఈఎన్సీ మురళీధర్మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి సహా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. 3 గంటలకు హెలిక్యాప్టర్లో మేడిగడ్డ నుంచి బయల్దేరి అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. అన్నారం బ్యారేజీని పరిశీలించిన అనంతరం 4.3 0 గంటలకు హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.