డిసెంబర్ 29న మేడిగడ్డకు మంత్రులు

డిసెంబర్ 29న మేడిగడ్డకు మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి సహా పలువురు మంత్రులు శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డను సందర్శించనున్నారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్​ను​ బుధవారం రిలీజ్​ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్​నుంచి మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఇరిగేషన్​ఈఎన్సీ మురళీధర్​ హెలిక్యాప్టర్​లో బయల్దేరుతారు. 

11.30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు.  మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇరిగేషన్​ఈఎన్సీ మురళీధర్​మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి సహా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు మీడియాతో ఇంటరాక్ట్​ అవుతారు. 3 గంటలకు హెలిక్యాప్టర్​లో మేడిగడ్డ నుంచి బయల్దేరి అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. అన్నారం బ్యారేజీని పరిశీలించిన అనంతరం 4.3 ‌‌0 గంటలకు హెలిక్యాప్టర్​లో హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు.