తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ కూల్చేసి కొత్తది కట్టడానికే తెలంగాణ ధనిక రాష్ట్రమా? ఆర్టీసీ కార్మికులకు మాత్రం జీతంలో కోత పెడ్తారా? మరీ ఘోరంగా కేవలం 49 రూపాయలు వేతనం ఎలా ఇస్తారు? కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉంది తెలుసా? అంటూ ఉత్తమ్న ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఓ ఆర్టీసీ డ్రైవర్ నెల జీతం రూ. 49 అంటూ ఓ పేపర్ లో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ట్వీట్ చేశారు. విధులకు వచ్చి రిపోర్టు చేసినా చాలా మందికి గైర్హాజరు వేశారనీ, భారీ మొత్తంలో జీతాలు కట్ చేశారనీ, ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్లు అన్నీ పోనూ సంగారెడ్డి డిపోకు చెందిన ఓ డ్రైవర్కు రూ.49 జీతం అందిందని ఆ వార్తలో రాశారు. చాలా మందికి రూ.100 లోపే జీతం వచ్చిందని అందులో తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.