మహబూబాబాద్ ఎంపీ టికెట్ వెంకన్నకు ఇవ్వాలి : వాగబోయిన చంద్రయ్య దొర

మహబూబాబాద్ ఎంపీ టికెట్ వెంకన్నకు ఇవ్వాలి : వాగబోయిన చంద్రయ్య దొర

గుండాల, వెలుగు: మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ యట్టి వెంకన్నకు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ వాగబోయిన చంద్రయ్య దొర డిమాండ్​చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబాద్ పార్లమెంట్ టికెట్ ను మూడు దశాబ్దాలుగా ఒకే తెగకు చెందిన లంబాడీలకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీలకు ఇవ్వాల్సిందేనని కోరారు. మహబూబాద్​ఎంపీ సెగ్మెంట్​లో 5,71,215 మంది ఆదివాసీ ఓటర్లున్నట్లు గుర్తు చేశారు.