తిరుమలలో అట్టహాసంగా వైకుంఠ ఏకాదశి

తిరుమలలో అట్టహాసంగా వైకుంఠ ఏకాదశి

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి సందర్భంగా వేకువ జామునే చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తర్వాత స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని ఉంచి చక్ర స్నానం నిర్వహించారు. అంతకు ముందు పుణ్యాహవచనం నిర్వహించారు.