గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఘోర ప్రమాదం తప్పింది.  ఆయన  కాన్వాయ్‌కి ప్రమాదానికి గురైంది.  సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంశీ తన కాన్వాయ్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.

 ఎమ్మెల్యే ప్రయాణిస్తు‍న్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది.  అయితే  ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.  దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వంశీ మిగిలిన వాహనాలతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.