వరుణ్, మేనకా గాంధీలకు బీజేపీ షాక్

వరుణ్, మేనకా గాంధీలకు బీజేపీ షాక్

బీజేపీలోని గాంధీలకు షాకిచ్చింది పార్టీ హైకమాండ్. కొత్తగా ప్రకటించిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి మేనకా గాంధీని పార్టీ నాయకత్వం తప్పించింది. ఆమె కొడుకు వరుణ్ గాంధీని కూడా తొలగించారు. మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నుంచి, వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి ఎంపీలుగా ఉన్నారు. అయితే లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలు, రైతులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును బహిరంగంగానే విమర్శించారు వరుణ్ గాంధీ. దీనికి సంబంధించి వరుస ట్వీట్స్ చేశారు. దీనిపై హైకమాండ్ సీరియస్ గా ఉందని... అందుకే మేనక, వరుణ్ లను పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

జిల్లాకో మెడికల్ కాలేజీ పెడ్తం: ప్రధాని మోడీ

హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ వార్నింగ్