ఇదేం అభిమానం.. పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోం : సజ్జనార్

ఇదేం అభిమానం..  పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోం : సజ్జనార్

బిగ్ బాస్-7 ఫైనల్ అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర.. అమర్‌దీప్ , ప్రశాంత్‌ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది.  ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.  హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్​దీప్ కారు అద్దాలను కూడా పగలగొట్టారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను కూడా వదల్లేదు. కొంతమంది బస్సు అద్దాలు కూడా పగలుగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.  

బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఆరు బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అంటూ ఆయన ట్వీట్ చేశారు.