ఎములాడ గుడిలో .. దర్గా కోసం రెండు వర్గాల గొడవ

ఎములాడ గుడిలో .. దర్గా కోసం రెండు వర్గాల గొడవ

‌వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అవరణలోని దర్గా మెయింటనెన్స్​విషయంలో రెండు ముస్లిం వర్గాల మధ్య గురువారం గొడవ జరిగింది. ఈ దర్గాను తరతరాలుగా రెండు వర్గాలు ప్రతి యేడాది శివరాత్రికి  ఒక వర్గం చొప్పున మెయింటెయిన్​  చేస్తున్నారు. కానీ, రెండు మూడేండ్లుగా దర్గాపై పూర్తిస్థాయి హక్కులు తమకే ఉన్నాయని అక్బర్​ హుస్సేన్ ​వారసులు ఇఫ్తేకార్​ హుస్సేన్​ వర్గం, అది కరెక్ట్​ కాదని తాతల కాలం నుంచి ఇద్దరికీ హక్కులున్నాయని అష్రఫ్​అలీ ఇబ్రహీం వారసులు నసీర్​వర్గం గొడవ పడుతున్నారు. 

దీని గురించి ఇఫ్తేకార్​హుస్సేన్​వర్గం కోర్టుకు వెళ్లింది. గురువారం వక్ప్​ బోర్డు ఇచ్చిన ఓ కాపీతో  దర్గా వద్దకు వెళ్లారు. అప్పటికే దర్గాలో ఉన్న ససీర్​ వర్గం దర్గాపై తమకూ హక్కులు ఉన్నాయని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను బయటకు పంపి దర్గాకు తాళం వేశారు. శివరాత్రి వరకు ఒక వర్గానికి అవకాశం ఉండగా అక్రమంగా వెళ్లి గొడవ చేసిన ఇఫ్తేకార్ ​హుస్సేన్, రెహన్, జుల్ఫికర్​లపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ ​తెలిపారు.