వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాముల ధర్నా

వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాముల ధర్నా
  • స్పర్శ దర్శనం కల్పించాలని అడిగితే పట్టించుకోవడం లేదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాములు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని దీక్ష చేపట్టి మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తే తమను పట్టించుకోవడం లేదంటూ.. స్పర్శ దర్శనం కల్పించమని అడిగితే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు, పాలకమండలి వైఖరిని నిరసిస్తూ ఆలయం చైర్మన్ గెస్ట్ గౌస్ వద్ద శివ స్వాములు ధర్నా కు దిగారు. 
మహా శివరాత్రి జాతర సందర్భంగా స్వామి స్పర్శ దర్సనం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ మొక్కుబడుల గురించి.. ఆలయంలో పరిస్థితి గురించి అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయంలో శివ స్వాములకు విలువ ఇవ్వకుండా కేవలం రాజకీయ నాయకులకే ప్రాధ్యానత ఇస్తున్నారని వారు ఆరోపించారు.

 

ఇవి కూడా చదవండి

రాజన్న టెంపుల్ కు ఉచిత బస్సు సర్వీస్

బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస..బంద్కు బీజేపీ పిలుపు

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం