ఎములాడలో శివరాత్రి మొక్కుల ఆదాయం రూ.1.21కోట్లు

ఎములాడలో శివరాత్రి మొక్కుల ఆదాయం రూ.1.21కోట్లు

వేములవాడ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.21కోట్ల ఆదాయం వచ్చింది. ఇది కేవలం ప్రసాదాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవల ద్వారా మాత్రమే సమకూరింది. హుండీలను రేపు  ప్రత్యేకంగా లెక్కించనున్నారు. ఈ నెల 17,18,19 తేదీల్లో ప్రసాదాల ద్వారా రూ. రూ. 55.24లక్షలు, కోడె మొక్కుల ద్వారా రూ. 48.58లక్షలు, ఆర్జిత సేవల ద్వారా రూ. 1. 32లక్షలు, తలనీలాల ద్వారా రూ.4,36లక్షలు,   బద్దిపోచమ్మ ఆలయానికి రూ 1.81లక్షలు, భీమేశ్వర ఆలయానికి రూ. 1.28లక్షలు వచ్చినట్లు తెలిపారు. గత 10 రోజులకు సంబంధించిన హుండీలను రేపు లెక్కించనున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం కూడా ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి.